ఈ క్రమంలోనే ఆటగాళ్లకు సంబంధించిన ఏ విషయం వెలుగులోకి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇక ఎంతోమంది క్రికెటర్లు అటు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇటీవల ఒక భారత మహిళా క్రికెటర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఏకంగా బిజెపి పార్టీలోనే పెద్దలు అందరూ కూడా ఒక క్రికెట్ జట్టుగా ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ.. వసూలి టైటాన్స్ అనే టైటిల్ ని ఇచ్చింది భారత మహిళా క్రికెటర్ పూజ వస్త్రాకర్.
ఈ క్రమంలోనే ఈ క్రికెటర్ ఏమైనా కాంగ్రెస్ లో చేరబోతుందా.. ఎందుకు ఇలా బిజెపిని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ విషయంపై ఇటీవల క్షమాపణలు చెప్పింది పూజ వస్త్రాకర్. నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక అభ్యంతరకర పోస్ట్ వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా దగ్గర లేదు. ఇందుకు నన్ను క్షమించాలి అంటూ కోరింది ఈ మహిళ క్రికెటర్.