సాధారణంగా క్రికెట్ కి అటు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్న ఎందుకో క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. కొంతమంది కాస్త ఖర్చు అయినా పర్వాలేదు ఇక నేరుగా స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించి ఇక అసలు సిసలైన క్రికెట్ మజాని పొందాలి అని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి.. ఆటగాళ్లకు కూడా సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఆటగాళ్లకు సంబంధించిన ఏ విషయం వెలుగులోకి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇక ఎంతోమంది క్రికెటర్లు అటు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇటీవల ఒక భారత మహిళా క్రికెటర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఏకంగా బిజెపి పార్టీలోనే పెద్దలు అందరూ కూడా ఒక క్రికెట్ జట్టుగా ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ.. వసూలి టైటాన్స్ అనే టైటిల్ ని ఇచ్చింది భారత మహిళా క్రికెటర్ పూజ వస్త్రాకర్.



 ఈ క్రమంలోనే ఈ క్రికెటర్ ఏమైనా కాంగ్రెస్ లో చేరబోతుందా.. ఎందుకు ఇలా బిజెపిని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ విషయంపై ఇటీవల క్షమాపణలు చెప్పింది పూజ వస్త్రాకర్. నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక అభ్యంతరకర పోస్ట్ వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది.  కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా దగ్గర లేదు. ఇందుకు నన్ను క్షమించాలి అంటూ కోరింది ఈ మహిళ క్రికెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: