2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" ప్రస్తుతం రసవత్తరంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లు పూర్తి కాగా దాదాపు ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ ను రేపుతూ ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ లను చూసే సమయం లో టీవీ లకు ... సెల్ ఫోన్ లకి అతుక్కుపోతున్నారు. ఇకపోతే నిన్న బెంగళూరు ... కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగులను చేయగా ... ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ టీం ఈ టార్గెట్ ను అతి సులువుగా పూర్తి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక నిన్నటి మ్యాచ్ ముగియడం తో క్రికెట్ అభిమానులంతా ఈ రోజు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజు "ఎల్ ఎస్ జి" మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లక్నోలో ఉండనుంది. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ రెండు టీం లు పంజాబ్ లో మ్యాచ్ లు ఆడాయి. అందులో లక్నో 257 పరుగులు చేయగా ... పంజాబ్ 201 ఒక రన్స్ చేసి ఓడిపోయింది. ఇకపోతే లక్నో లో ఈ రోజు పిచ్ కొంత మందకోడిగా ఉండడంతో ఈ మ్యాచ్ లో భారీ పరుగులు రాకపోయే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటి వరకు పంజాబ్ రెండు మ్యాచ్లు ఆడగా అందులో ఒక విజయాన్ని సాధించింది. లక్నో మాత్రం ఇప్పటి వరకు బోనీ కొట్టలేదు. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే లక్నో "ఐ పీ ఎల్"  2024 సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl