ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" లో అద్భుతమైన క్రేజ్ ఉన్న టీమ్ లలో ముంబై ఇండియన్స్ టీం ఒకటి . ఈ టీం కు ఇంతలా క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఇందు లో దాదాపు చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉండడం . అలాగే ఈ టీం కూడా ప్రతి సీజన్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఉండడం తో ఈ టీం అంటే చాలా మంది క్రికెట్ అభిమానులు ఇష్ట పడతారు . అంతా ఫేవరెట్ టీం అయినటువంటి ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం చాలా పేలవమైన ప్రదర్శనను చూపిస్తుంది.

ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీం రెండు మ్యాచ్ లను ఆడ గా రెండింటి లోనూ ఓడిపోయింది . ఇక పోతే కొన్ని రోజుల క్రితమే ముంబై ఇండియన్స్ టీం హైదరాబాద్ సన్రైజర్స్ తో ఓ మ్యాచ్ ఆడింది .  అందు లో సన్రైజర్స్ టీం ఇంత వరకు "ఐ పీ ఎల్" లో ఏ సీజన్ లో ఎవరూ కొట్టనంత భారీ స్కోరు ను ముంబై పై కొట్టింది . దీనితో ముంబై ఇండియన్స్ టీం పై వారి అభిమానులు పెట్టుకున్న అంచనాలు పూర్తిగా తగ్గాయి.

ఇకపోతే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు . ఇక ముంబై ఇండియన్స్ వరస ఓటములకు హార్దిక్ పాండ్యా కారణమని ఈ జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు ఓ టాక్ నడుస్తోంది . దీనితో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్సీ బాధ్యతల ను స్టార్ బౌలర్ జేస్ప్రిత్ బూమ్రా కి అప్పగించాలని ముంబై ఇండియన్స్ టీం యాజమాన్యం చూస్తున్నట్లు .... ప్రస్తుతం దీని పై యాజమాన్యం బాగా కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: