ఇండియన్ క్రికెట్ టీం లో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. ఇదేనా ఇప్పటి వరకు ఇండియా టీమ్ కు సాధారణ ఆటగాడిగా అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి అన్ని విజయాలను అందించాడు. ఇక ఆ తర్వాత ఈయన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించి ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ అయ్యాడు.  కెప్టెన్ అయిన తర్వాత కూడా ఈయన ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందే గ్రహించి ఎన్నో వ్యూహాలను రచించి ఇండియన్ టీం కు ఎన్నో విజయాలను అందించాడు.

అలాగే ఎన్నో ట్రోఫీలను కూడా ఇండియా జట్టు ఈయన నేతృత్వంలో గెలిచింది. ఇంతటి క్రేజ్ కలిగిన రోహిత్ ఐపీఎల్ లో కూడా ఎన్నో సీజన్ లకి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈయన కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ జట్టుకి కూడా ఎన్నో ట్రోఫీలు వచ్చాయి. ఇంతటి నైపుణ్యం కలిగిన ఈయనను ఈ సీజన్ లో ముంబై జట్టు పక్కన పెట్టి హార్దిక్ తో కెప్టెన్సీ చేయిస్తుంది  దీనితో ఎంతో మంది విమర్శలను విమర్శలు చేశారు. ఆ విమర్శలకు తగ్గట్టే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవమైన ప్రదర్శనను కనబరిస్తుంది.

ఇక రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు వైఖరి పట్ల రోహిత్ అసంతృప్తి గా ఉన్నట్టు వచ్చే సీజన్ లో మెగా ఆప్షన్ కు రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీని గురించి తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ ... వచ్చే సీజన్ లో ఏ జట్టుకు ఆడాలి అనేది పూర్తిగా రోహిత్ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నాడు. ఇకపోతే "ఐ పి ఎల్" లో ఏ టీం అయినా సరే రోహిత్ ని తమ టీం కు కెప్టెన్ గా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది అని ఈయన చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: