ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు అటు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. కొంతమంది కాస్త ఖర్చయినా పర్వాలేదు స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించేందుకు  ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ కు ఈ రేంజ్ లో ఉన్న క్రేజ్ దృశ్య అటు భారత క్రికెటర్లందరూ కూడా కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు.


 కేవలం ఐపిఎల్ ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే కాదు.. మరోవైపు ఇక బీసీసీఐ చెల్లించే వార్షిక ఆదాయంతో పాటు మ్యాచ్ ఫీజుల రూపంలో ఆదాయం పొందుతూ ఉంటారు. ఇక అంతకుమించి వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఒక్కసారి ఎవరైనా క్రికెటర్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు అంటే చాలు ఇక ఆ తర్వాత కాలంలో అతను లగ్జరీ లైఫ్ గడపడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే క్రికెటర్లు ఏదైనా కొత్త వస్తువు కొన్న లేకపోతే కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అధికాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న పృథ్వి షా ఇక ఇటీవల ఒక లగ్జరీ ప్లాట్ కొన్నాడు అన్న వార్త వైరల్ గా మారింది. ముంబైలోని ఒక కాస్లీ ఏరియాలో 20 కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాట్ కొన్నాడట. బాంద్రాలో సముద్రం ఎదురుగా ఉన్న ఫ్లాట్ ని సొంతం చేసుకున్నాడట. ఇందుకు సంబంధించిన ఫోటోలను పృద్వి షా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని ఎనిమిది కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: