ఇవాళ (ఐపీఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ... ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఈసారి ఫేవరెట్ జట్లల బరిలోకి దిగాయి. కాకపోతే సీజన్ ప్రారంభం అయిన తరువాత ఈ రెండు టీమ్స్ కూడా అత్యంత పేలవమైన ప్రదర్శనను ఇప్పటివరకు కనబరిచాయి.

ఇప్పటివరకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం ఐదు మ్యాచ్ లను ఆడితే కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్లు పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లను ఆడితే కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచి మూడింటిలో ఓడిపోయి పాయింట్లు పట్టికలో లాస్ట్ నుంచి మూడవ స్థానంలో కొనసాగుతుంది.

ఇలా పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఘోరమైన దశలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు పాయింట్లు పట్టికలో మెరుగైన స్థితికి వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు మ్యాచ్ లో అందరి చూపులు ఒక ఆటగాడిపైన ఉన్నాయి. అతనే మ్యాక్స్వెల్. ఎందుకు ఇతడిపై అంతా అంచనాలు అంటే... ఈ రోజు బెంగుళూరు , ముంబై మధ్య మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది.

ఈ స్టేడియంలో పోయిన వరల్డ్ కప్ లో మాక్స్వెల్ డబల్ సెంచరీ కొట్టాడు. 91 పరుగులకు 7 వికెట్లు నష్టపోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈయన డబల్ సెంచరీ కొట్టి అద్భుతమైన విజయాన్ని అతని జట్టుకు అందించాడు. ఇక ఈయన ఈ గ్రౌండ్ లో డబుల్ సెంచరీ కొట్టడంతో ఈ రోజు కూడా అలాంటి అద్భుతమైన ప్రదర్శననే ఈ ఆటగాడు ప్రదర్శిస్తాడు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: