బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అయ్యే కొద్ది ఉన్న వాళ్లకు టెన్షన్ మొదలైంది.. ఏడో వారం ఎలిమినేషన్ పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం నిన్న నామినేషన్ కూడా పూర్తయింది. అయితే ఈ షో లో మళ్లీ నామినేషన్ మొదలైంది అంటే..మళ్లీ
రచ్చమొదలైందని అర్థం ఇప్పుడు అదే జరుగుతుంది. వారం వారం ఎలిమినేషన్ పూర్తయ్యాక షో పై విమర్శలు రావడం సహజం. ఇప్పుడు దివి ఎలిమినేషన్ తర్వాత అదే వెలుగు చూసింది..
మార్నింగ్ మస్తీలో భాగంగా.. తమకు నచ్చిన వ్యక్తి గురించి పాజిటివ్, నెగిటివ్ అంశాలను రాసి వాటిని చదివి వినిపించాలని చెప్పారు బిగ్ బాస్. చాలావరకూ పాజిటివ్గానే రాసుకున్నారు కంటెస్టెంట్లు. అభి కోసం
అఖిల్ రాయగా.. మెహబూబ్ కోసం మోనాల్ చాలా పాజిటివ్గా రాసింది. ఆ తరువాత
లాస్య, అరియానా, మోనాల్లు బతుకమ్మ ఆడుతుంటే వాళ్లతో జతకలిసి బతుకమ్మ ఆడాడు అవినాష్.. ప్లాస్టిక్ పూలతో అలంకరించి బతుకమ్మ ను ఆడారు.
ఈ నామేషన్ లో
అమ్మ రాజశేఖర్ మాస్టర్ అఖిల్ ను నామినేట్ చేశారు.. అయితే ఈ నామినేషన్ వల్ల ఒకరిపై మరోకరు బూతులను వినిపించారు.అది కాస్త వివాదంగా మారింది... ఇప్పుడు నామినేషన్ లో కొన్ని తప్పులు జరిగాయి. ఇక మళ్లీ టాస్క్ లో నిమగ్నమయ్యారు.. ఇది ఉండగా ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది..తనని
కొత్తిమీర, కరివేపాకు అంటే ఇలాగే మాట్లాడతా.. ఎలిమినేట్ అయితే ఏదైనా మాట్లాడొచ్చా.. అంటూ మరోసారి తన యాటిట్యూడ్ చూపించాడు అఖిల్. అయితే ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ చాలా హాట్ హాట్ గా సాగింది.ఎలా ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి . ఈ వారం
బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.. చూద్దాం మోనాల్ , ఆరియనా ఎవరు ఉంటారో..