విషయానికొస్తే..రాజీవ్ కనకాల వెండితెరపై నటుడిగా తన కంటూ ముద్ర వేసుకున్నాడు. అయితే అంత కంటే ముందుగానే బుల్లితెరపై రాజీవ్ కనకాల తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బుల్లితెర నుంచి కెరీర్ను ప్రారంభించిన రాజీవ్ కనకాల.. వెండితెరపై భిన్న రకాల పాత్రలను పోషించాడు. బుల్లితెరపై ధారావాహికల్లోనే కాకుండా కామెడీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. అలా బుల్లితెరపై ఒకప్పుడు ఎంతో స్టార్డంను అనుభవించాడు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ అటుగా అడుగులు వేశారు.
బుల్లితెరపై షోలు మానేసి చాలా కాలమే అవుతోంది. ఒకప్పుడు రాజీవ్ కనకాల హోస్ట్గా, యాంకర్గా దుమ్ములేపేశాడు. ఫ్యాన్స్తో నేరుగా తమ అభిమాన హీరోలతో ముచ్చట్లు పెట్టించేవాడు. అభిమాని, హీరో మధ్య ప్రేమను అందరికీ చూపించేవాడు. అయితే ఈ మధ్య మాత్రం రాజీవ్ కనకాల కేవలం స్పెషల్ గెస్ట్గా వస్తున్నాడు... సుమ చేస్తున్న షో లలో గెస్ట్ గా చాలా సార్లు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా రాజీవ్ కనకాల కొత్త షోను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. నవ్వించడానికి వంద దారులున్నాయి.. ఆ వంద దారులు ఒకే చోటకు వస్తే.. అంటూ రాజీవ్ కనకాల అనడం.. జంక్షన్ జామ్ అయిపోద్దంటూ కౌంటర్ వేయడం.. ఇక పటాస్, జబర్దస్త్ టీంలోని కొంతమంది ఆర్టిస్ట్లతో చేస్తోన్న ఈ రెచ్చిపోదాం బ్రదర్ అనే షో బాగానే క్లిక్ అయ్యేలా ఉంది. అయితే రాజీవ్ కనకాల ఈ ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి... మొత్తానికి రాజీవ్ సుమ కు పోటీని ఇవ్వనున్నారు.