నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా ఎంతోమంది నటీనటులు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. ఇక ఈ సీరియల్ ప్రారంభంలో క్రిష్ పాత్రలో నటించిన మధు ప్రస్తుతం నా పేరు మీనాక్షి సీరియల్ లో చనిపోయినట్టుగా చూపించారు. మధు కొన్ని అనుకోని కారణాల చేత నా పేరు మీనాక్షి సీరియల్ నుంచి తప్పుకున్నాడు అని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా సీరియల్ నిర్వాహకులతో మధు గొడవ పడినట్లు అందుకే సీరియల్లో అతని పాత్రను చంపేసారు అని సమాచారం. అప్పటికే తన నటనతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన మధు , ఆ తర్వాత తన నటనతో ఎంతోమందిని అభిమానులను గా మార్చుకున్నారు. ఇక మధు రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.


ఇక మధు అసలు పేరు మధుసూదన్. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాడు. మధుసూదన్ చూడడానికి తెలుగు అబ్బాయిలా కనిపించినా కర్ణాటక అబ్బాయి. అయితే అందరిలాగ మధుసూదన్ కి సినీ ఇండస్ట్రీలో కి రావాలనే కోరిక ఏ రోజు లేదట.. కానీ అతని బాబాయి ప్రోత్సాహంతోనే బలవంతంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.  మాస్టర్ సత్యానంద దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాడు. మొదట సీరియల్స్ లోకి అడుగుపెట్టక ముందు కొన్ని సినిమాలలో నటించిన మధుసూదన్ అక్కడ ఏ మాత్రం విజయం సాధించలేకపోయాడు.

తన విలువైన సమయాన్ని అంతా వృథా చేసుకున్నామని సినిమాలంటేనే తమకు సెట్ అవవని నిర్ణయించుకున్నాడట మధుసూదన్. అయితే మంచిగా చదువుకున్నాను సినిమా ఫీల్డ్ అచ్చిరాలేదు కాబట్టి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకొని జీవితాన్ని హాయిగా గడిపేద్దాం అని అనుకున్న సమయంలోనే,  జీ తెలుగు నుంచి గోరంత దీపం సీరియల్ కోసం మధుసూదన్ కు పిలుపు వచ్చింది. అలా మొదటిసారి గోరంత దీపం సీరియల్ లో నటుడిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఈ సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న మధుసూదన్ ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటించడం మొదలు పెట్టాడు. ఇక తర్వాత ముత్యాల ముగ్గు సీరియల్ లో కూడా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: