నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫోన్ నిత్య జీవితంలో అవసరం గా మారిపోయింది. అస‌లు ఫోన్ లేనిదే నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నారు చాలా మంది. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కొత్త ఫోన్ కొనాల‌నుకునేవారికి గుడ్‌న్యూస్ అని చెప్పాలి. అది కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లోనే ఫోన్ కావాల‌నుకునేవారికి ఇది ఓ తీపి క‌బురు. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేసింది.

 

అదే ఒప్పో ఏ11కే. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్, మనదేశంలోని ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఒప్పో ఏ11కే లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ను అందించారు. వెనకవైపు రెండు కెమెరాల సెటప్ కూడా ఉంది. ఈ ఫోన్ ధ‌ర రూ.8,990 మాత్ర‌మే. మ‌రి ఒప్పో ఏ11కే స్పెసిఫికేషన్స్ చూస్తే..  6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో పీ35 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో ఉన్నాయి.

 

మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని పెంచుకునే అవకాశం ఉంది.  అలాగే దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉంది. యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉంది. ఐ ప్రొటెక్షన్ మోడ్ ను కూడా ఇందులో అందించారు. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. కెమెరా విష‌యానికి వ‌స్తే..  వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా.. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ను అందించారు. మ‌రియు  5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో అమ‌ర్చారు. ఇక దీని బ్యాటరీ సామర్థ్యం 4,230 ఎంఏహెచ్ గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఒప్పో ఏ11కే.. డీప్ బ్లూ, ఫ్లోయింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: