ఈ ఫీచర్ ను మీరు వాదాలనుకుంటే కనుక మీరు ఇప్పటికే ఉన్న చాట్ థ్రెడ్పై స్వైప్ చేస్తే రెండవ స్వైప్ సాధారణ చాట్ మోడ్ కు తీసుకువెళ్తుంది. ఇక్కడ చాట్లో సీక్రెట్ మోడ్ను ఉపయోగించవచ్చని ఫేస్బుక్ చ్బెఉథిన్ది. అయితే ఇది గ్రూప్ చాట్లకు వర్తించదు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే మరో ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులు చూసిన తర్వాత అదృశ్యమయ్యే ఫోటోలు మరియు వీడియోలను పంపడానికి ఈజీగా ఉంటుంది. ఈ వానిష్ మోడ్ను చేర్చడం వల్ల దీని మెసేజింగ్ స్నాప్ చాట్ కి సమానంగా ఉంటుంది. ఇక ఇన్స్టాగ్రామ్ కూడా టిక్ టాక్ లాంటి రీల్స్ అంటూ ఒక ఫీచర్ తీసుకొచ్చింది.
ఇలా రోజూ సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది ఫేస్ బుక్. ఇక భారత్ వినియోగదారులకు దీపావళి వేడుకలను మరింత ఉత్సాహపరిచేందుకు ఫేస్బుక్ దీపావళి అవతార్ లతో సహా పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. “పండుగ ఉల్లాసాన్ని ఆన్లైన్లో వ్యాప్తి చేయాలనే” లక్ష్యంతో వీటిని రిలీజ్ చేసామని పేర్కొంది. ఈ కరోనా టైంలో చాలా మంది వినియోగదారులు తమ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను కలవలేరు. ఈ ఫీచర్ తో అవతార్ ను రెడీ చేసి మీమీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను అలరించవచ్చని పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి