ఆనోట ఈనోట ఇతగాడి గురించి తెలిసి ఇటీవల సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యాడు. ఎవరైనా చనిపోయినప్పుడు హిందు సంప్రదాయ ప్రకారం మూడో రోజు, ఆ తర్వాత 11వ రోజున ఆ వ్యక్తికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి అంత్యక్రియలు జరిగిన చోట పెట్టడం ఆనవాయితీ..అయితే పట్టణాలు ఇలాంటి మాటే వినిపించలేదు..పెరుగుతున్న కాలుష్యాల వల్ల కాకుల జాడ లేకుండా పోయింది. ఈ సంగతి ఆ పెద్దాయన మనసును ఆలోచనలో పడేసింది.దాన్ని ఉపాధిగా మార్చుకున్నాడు.. డబ్బులను సంపాదిస్తున్నాడు.
కొంతమంది పిండాలు పట్టుకుని అందరూ అతడి ఇంటికి వస్తున్నారు. అంతేకాదు ఈ విషయం అందరికీ తెలిసిలా సోషల్ మీడియా వేదికను వాడుకుంటున్నాడు. పిండ ప్రదానాలకు, సమారాధనల కు కాకి లభించును అంటూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ కూడా పెడుతున్నారు.. దీంతో అతనికి పాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అతడి ఆలోచన వర్కవుట్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటుండటం విశేషం. అంతేకాదు ఎవరికైతే అవసరముంటుందో వాళ్లే కారులో తీసుకెళ్లడం, దింపడం చేస్తున్నారట. ఇలా రోజుకు ఇతడు రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు సంపాదిస్తున్నాడు.. అతడి ఆలోచన పై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి