సాధారణంగా అమావాస్య రోజును తమిళులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా నదపనహళ్లి అనే గ్రామంలో పెరియ కరుప్పరసామి అనే స్వామికి ప్రతి ఏటా ఆషాడ అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే చేశారు. అయితే ఆలయ ప్రధాన పూజారి చెప్పినట్లుగా.... పాలల్లో కారంపొడి కలుపుకుని స్నానం చేసి... స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఇక స్వామి వారికి నైవేద్యంగా మద్యం, సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను సమర్పించారు. ఇక స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి వారి విజ్ఞప్తులను ఆలయ ప్రధాన పూజారి స్వీకరించారు. అది కూడా రెండు కొడవళ్లపై కాళ్లు పెట్టి మరీ. ఇక చివరగా.. ప్రధాన పూజారి గోవిందన్... భక్తులు సమర్పించిన 108 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభ్యంగన స్నానం చేశారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామానికి ఎలాంటి దుష్టశక్తులు రావని... దురదృష్టం నుంచి భక్తులను స్వామి రక్షిస్తారని అక్కడి భక్తుల మూఢ నమ్మకం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి