మనం ..మన కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అని స్వాతంత్ర్య సమర యోధులు ఒక్కసారి అనుకుని ఉన్నా నేడు మనకు ఈ స్వేచ్చ ఉండేది కాదు. మనం మన కుటుంబాలతో హాయిగా జీవించే వాళ్ళమా ఒక్కసారి ఆలోచించండి. మన నాయకులు తమ గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించారు, తమ తదుపరి తరాలు స్వేచ్చగా ఆనందంగా జీవించాలి అని కోరుకున్నారు. అందుకోసం ఆంగ్లేయులకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. మనం వారిలా ప్రాణాలు త్యాగం చేయకపోయినా పర్వాలేదు. కనీసం సాయం కోసం ఎదురు చూసే చేతికి మనకు వీలైనంతలో సహాయం చేద్దాం.
మనతో కలసి ఈ సమాజంలో జీవిస్తున్న తోటి మనుషులను గౌరవిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవరి గురించో ఎందుకు ఆలోచించాలి అనుకుంటే...నీ గురించి కూడా ఎవరు ఆలోచించరు. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగొస్తుంది అన్నారు పెద్దలు. ఒక మనిషిగా ఆనందాన్ని పంచు, వీలైనంత సహాయం చెయ్యి. అప్పుడు నీకు కూడా అవసరమైనప్పుడు సహాయం దక్కుతుంది. పూర్వం మన భారతీయులు సైతం ఆ మంచితనం వలనే ఆంగ్లేయులు మన దేశంలోకి రాగలిగారు. కానీ వారు మనము చేసిన సహాయాన్ని దుర్వినియోగానికి ఉపయోగించారు. ప్రతి విషయంలోనూ మనకు ప్రేరణ మన పూర్వీకులే.