దేశంలో కామాంధులు బరితెగించి పోతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తూ తల ఎత్తుకోకుండా చేస్తున్నారు. చిన్న, పెద్ద, తల్లి, పిల్ల తేడా లేకుండా ఆఘాయిత్యాలకు పాల్పడి రాక్షస ఆనందం పొందుతున్నారు. మద్యం మత్తులో ఏమీ ఏర్పడక కామవాంఛ తీర్చుకోవడమే లక్ష్యం అన్నట్లుగా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎదురు తిరిగితే  అంతమొందించి అరాచకాలు చేస్తున్నారు. ఎవరూ ఏమీ చేయలేరన్న లెక్కలేనితనంతో తిరుగుతూ మహిళలను గోస పెడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు ఘటనను మరువక ముందే తెలంగాణలో మరో కామాంధుడు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కూలీ దంపతుల కుమార్తె (14) హాస్టల్ లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. కూతురికి జ్వరం వచ్చి తీవ్రంగా బాధపడుతుందని తెలియడంతో మూడు రోజుల క్రితం బాలికను తండ్రి ఇంటికి తీసుకువచ్చాడు. శుక్రవారం రోజు తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో నీరసించి పోయిన బాలిక కదల్లేకుండా నిస్సహాయ స్థితిలో ఉంది. 

 

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల ఆటో డ్రైవర్ కోటి ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. జ్వరంతో ఉన్న కూతురుకు పండ్లు, ట్యాబ్లెట్స్ తీసుకుని మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన తండ్రి.. కుమార్తె కేకలు విని ఆందోళనకు గురయ్యాడు. జరుగుతున్న దారుణాన్ని గమనించి ఒక్కసారిగా భయానికి గురయ్యాడు. వెంటనే కోటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో.. ఆటో డ్రైవర్ ప్రతిఘటించి గోడ దూకి పారిపోయాడు.

 

ఈ మేరకు బాలిక తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: