చూస్తుండగానే శీతాకాలం అయిపోయి వేసవి కాలం రానే వచ్చింది. సాధారణంగా ఎండల దెబ్బకు అత్యవసరమైన పని ఉంటే తప్పా.. ప్రజలు బయట కాలు కూడాపెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా గర్భిణులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భధారణ సమయంలో గర్భిణులు తమ బరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును మోస్తుండటంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు.. హార్మోనుల మార్పుల వల్ల శరీరంలో వేడి ఆవిర్లు, నీరు పట్టడం, అలసట, నీరసం వంటి సమస్యలతో గర్భిణీలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక వేసవి కాలంలో వేడి వాతావరణం కారణంగా ఈ సమస్యలు మరింత చికాకు పుట్టిస్తూ ఇబ్బందిని గురవుతూనే ఉంటారు.

అయితే వేసవి కాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా వేసవిలో గర్భిణీ స్త్రీలు లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు వంటివి తరచూ తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారని చెబుతున్నారు.

అంతేకాదు.. గర్భిణీలు కాళ్ళ వాపులతో బాధ పడుతుంటారని అన్నారు. ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కాళ్ళను ఎత్తులో పెట్టుకోవాలని అన్నారు. అలా చేయడం వలన కాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం వల్ల పాదాలకు నీరు చేరదని అన్నారు. గర్భిణులు తీసుకునే ఆహారంలో ఉప్పును బాగా తగ్గించి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఎండా కాలంలో గర్భిణీలు మెత్తగా, వదలుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని చెబుతున్నారు.

అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. ఇవి చెమటను చాలా సులభంగా గ్రహించడమే కాకుండా సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడానికి దోహదపడుతాయి. అయితే ఈ సీజన్‌లో గర్భిణీలు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. ఇక వేసవి వేడిని అదిగమించాలంటే గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సమ్మర్‌లో మసాలా వంటలు, మాంసాహారం, కూల్ డ్రింక్స్‌, కాఫీ, టీలు, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం నివారించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: