ఎప్పుడూ ఏదో ఒక వివాస్ప‌ద అంశాల‌తో వార్త‌ల్లో ఉండే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇలాకాలో టీడీపీ దూసుకుపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కీల‌క పంచాయ‌తీలు టీడీపీ మ‌ద్ద‌తుదారుల ఖాతాలో ప‌డ్డాయి. గంగ‌న్న‌గూడెం - మొండూరు - వేగివాడ - జోగ‌న్న‌పాలెం - చ‌క్రాయగూడెం - పెద‌వేగి - కొవ్వ‌లి - తాళ్ల గోక‌వ‌రం - రామ‌సింగ‌వ‌రం - దెందులూరు - రామ‌చంద్రాపురం - ల‌క్ష్మీపురం - భోగాపురం - కొప్పాక - గుడిపాడు - కోటేశ్వ‌ర దుర్గాపురం - గాలాయ‌గూడెం పంచాయ‌తీల్లో సైకిల్ దూసుకు పోయింది.

ఇక వైసీపీ నుంచి ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత కామిరెడ్డి నాని శ్రీరామ‌వ‌రం స‌ర్పంచ్‌గా గెలిచారు. చ‌ల్ల‌చింత‌ల‌పూడి, పెరుగుగూడెం, మేదిన‌రావుపాలెం వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఏదేమైనా నియోజ‌క‌వ‌ర్గంలో చింత‌మ‌నేని పుంజుకున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: