యంగ్ హీరో విశాల్ ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంధ‌ర్బంగా విశాల్ మాట్లాడుతూ.... కాలిబాటన  తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక ఇవాళ తీరిందని చెప్పారు. ఇంతటి మంచి దర్శనం అందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు అంటూ విశాల్ వ్యాఖ్యానించారు.
దీపావలి సందర్భంగా తాను న‌టించిన ఎనిమి సినిమాను విడుదల చేయనున్నట్టు విశాల్ ప్ర‌క‌టించారు.  
మా సినీ కుటుంబ సభ్యుడైన పునీత్ అన్నయ్యను కోల్పోయామంటూ విశాల్ భావోద్వేగానికి లోన‌య్యారు.


అన్నయ్య సంకల్పం ఆగిపోకూడదు అని కోరుకున్నా అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.
పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని నేను చదివిస్తాను.... నేను మరో ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నా కానీ
ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు..... కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించా అంటూ విశాల్ వ్యాఖ్యానించారు. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారని విశాల్ భావోద్వోగానికి లోన‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: