ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు  హైద‌రాబాద్‌కు వెళ్లనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరుతారు. ఉదయం 11.20 గంటలకు సీఎం జగన్ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు మళ్లీ  తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.


తెలుగు సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ అకాల మ‌ర‌ణం వార్త వినగానే ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటనే స్పందించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి జగన్  సంతాపం తెలిపారు. కృష్ణ తెలుగువారి సూపర్ స్టార్ అని జగన్ కొనియాడారు. కృష్ణే మన అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అంటూ  జగన్ నివాళులు అర్పించారు. నిజ జీవితంలోనూ కృష్ణ మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారని సీఎం జగన్ నివాళులు అర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: