చాలా మంది దంతాలు కూడా పసుపు రంగులో ఉంటాయి.దీంతో వాళ్లు సరిగ్గా సరిగ్గా మాట్లాడలేక ఇంకా చక్కగా నవ్వలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.దంతాలపై గార పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వస్తాయి. వీటివల్ల చాలా మంది బాధపడుతున్నారు.ఇక ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల టూత్ పేస్ట్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయినా కానీ ఎలాంటి ఫలితం లేక బాధపడే వారు మనలో చాలా మంది  ఉన్నారు. అలాంటి వారు ఒక సులభమైన ఇంటి చిట్కాను వాడడం వల్ల చాలా ఈజీగా దంతాలను రెండు రోజుల్లోనే తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం కూడా చాలా తేలిక.దీనిని తయారు చేసుకోవడానికి  మనం కేవలం మూడు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా పావు టేబుల్ స్పూన్ వంటసోడా వేసి కలపాలి.


ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా బ్రష్ తో తీసుకుని దంతాలను బాగా శుభ్రం చేసుకోవచ్చు లేదా ఇందులో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకుని కూడా దంతాలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.ఇక ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం ఈజీగా తొలగిపోతుంది. దంతాలు ఈజీగా తెల్లగా మారతాయి.ఇంకా అంతేకాకుండా ఈ టిప్ ని వాడడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా ఈజీగా నశిస్తుంది. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు సమస్యలు తగ్గి చిగుళ్లు చాలా ఆరోగ్యంగా మారతాయి. ఇంకా దంతాల సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. దంతాలని శుభ్రంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: