ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు స్థాపించబడింది జనసేన పార్టీ అంటారు పవన్ కళ్యాన్.  ఇందులో ప్రతి ఒక్కరూ జనసైనికులే అంటున్న విషయం తెలిసిందే.  తాజాగా కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త బొమ్మదేవర చక్రి ఈ ఉదయం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్  జనసేన సైనికుడు ఇలా కన్నుమూయడం ఎంతో కలత చెందానని అన్నారు. ఈ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

 

బాధాతప్త హృదయంతో చక్రికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు చక్రి నిస్వార్థ జనసైనికుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని... కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు పవన్ సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: