సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేసే సినిమాపై అధికారిక ప్రకటన తో పాటుగా టైటిల్ కూడా వచ్చేసింది. సర్కారు వారి పాట అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక కాసేపటి క్రితం దీనిని మహేష్ బాబు తన సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

 

ఇక ఈ సినిమా  ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా దీనిపై మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కామెంట్ చేసాడు. ఈ సారి కూడా గెలుపు తధ్యం...ఒకటో సారి. అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ రీ ట్వీట్ ని చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: