ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విమానం కూలిన ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోని ధేంకనల్ జిల్లాలోని కంకదా హాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉన్న బీరసాల్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద ఈరోజు ఒక ట్రైనీ విమానం కూలిపోయిందని అధికారులు చెప్పారు. 

 

ఇది రన్ వే మీదనే కూలిపోయినట్టు తెలుస్తుంది. ట్రైనీ విమానం కూలిపోవడంతో బీహార్‌కు చెందిన ఒక పైలెట్ కెప్టెన్ సంజీబ్ కుమార్ మరణించారు అని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ అనిస్ ఫాతిమా ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: