తల్లి తండ్రులు తనని కార్టున్లు చూడనివ్వడం లేదని ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ఆధారంగా చూస్తే... మహారాష్ట్రలోని పూణే నగరంలో 14 ఏళ్ల బాలుడు కార్టున్లు చూస్తానని టీవీలో చానల్‌ మార్చబోయాడని... కానీ అతడి నాయనమ్మ న్యూస్ చూస్తోందని... ఇద్దరి మధ్య కాసేపు వాదనలు జరిగాయని పోలీసులు వివరించారు. ఇది చూసిన బాలుడి తల్లి టీవీ ఆఫ్ చేసిందని..

తల్లి టీవీ ఆఫ్ చేయడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: