తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్  రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలే కాదు అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు కూడా రోజూ భయం భయం గానే విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. 

 

 జిహెచ్ఎంసి లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ప్రావీణ్య కు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు కలవరపడుతున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రావీణ్య విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా  లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు  కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కమిషనర్ పేషీలోని సిబ్బంది హోమ్ క్వారంటైన్ లో  ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: