ఈ మధ్యకాలంలో అక్రమంగా గంజాయి రవాణా ఎక్కువవుతున్న  విషయం తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా పోలీసులకు తెలియకుండా గుట్కా గంజాయి రవాణా చేపడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో భారీ మొత్తంలో గుట్కాలను గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కొండపాక లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. హైదరాబాద్ నుండి తరలిస్తున్న గుట్కా ముఠాను పట్టుకున్నారు. 

 

 ఇక ఈ తనిఖీల్లో 54.9 లక్షల  విలువైన గుట్కా,  5 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. 1.5 లక్షల రూపాయల సిగరెట్లు కూడా పట్టుకున్నారు. ఇక నిందితుల వద్ద నుండి 6.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బొలెరో వ్యాన్ ఆటో 5 సెల్ఫోన్లు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ మీడియా ముందు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: