హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ సర్కారు తగిన పరీక్షలు నిర్వహించడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై స్పందించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ టెస్టులు నిర్వహించకుండా కరోనా  మీద పోరాటం చేయలేమని తెలిపారు. 


 తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు లేఖ రాసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ.. హైదరాబాద్ పరిధిలో సుమారు 20,000 టెస్ట్ లు  చేయాలని ఒక నాంపల్లి నియోజకవర్గంలోనే  2000 టెస్ట్ లు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని లేఖలో కోరారు, చార్మినార్ హైదరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.. వీలైనంత త్వరగా కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు అక్బరుద్దీన్ ఓవైసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: