అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం చాదస్తంతో ఆస్పత్రి నుంచి బయటకు రావడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఆయన నేడు వైట్ హౌస్ కి వెళ్ళిపోయారు. ఆయన ఆరోగ్యానికి ఏ విధమైన ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో నడుచుకుంటూ వైట్ హౌస్ లోకి వెళ్ళారు ట్రంప్.

ఇక అది అలా ఉంటే అమెరికా  అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్ధి జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ లు కచ్చితంగా మాస్క్ ధరించాలని, అమెరికన్లు అందరూ కూడా మాస్క్ ధరించాలి అని కోరారు. ఇక అంతే కాకుండా ట్రంప్ కోలుకోవాలని తాను ప్రార్ధన చేస్తున్నా అని జో బిడెన్ చెప్పడం విశేషం. ట్రంప్ భార్య వేగంగా కోలుకోవాలని కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: