ఇది నిజంగానే టీడీపీ ద‌య‌నీయ స్థితికి అద్దం ప‌డుతుంద‌నే చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. ఎక్క‌డైనా గెలిచాక క్యాంపులు ఉంటాయి. కానీ టీడీపీ త‌న అభ్య‌ర్థుల‌ను కాపాడుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతోంది. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణకు గ‌డువు ఉండ‌డంతో క‌నీసం త‌మ అభ్య‌ర్థులు పోటీలో ఉండేందుకు త‌మ వాళ్ల‌ను క్యాంప్‌ల‌కు త‌ర‌లిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీ కండువా కప్పుకోవడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో చంద్రబాబు సూచన మేరకు అనుమానమున్న టీడీపీ అభ్యర్ధులను క్యాంప్ లకు తరలిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాతనే వీరిని ప్రచారం చేసుకోవడానికి తీసుకువస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: