ఆంధ్రప్రదేశ్  లో    టిడిపి కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ ఒక వీడియో లో వ్యాఖ్యానించారు.ఇటువంటి దాడుల విషయంలో కేంద్ర హోం శాఖ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ దాడులు చేసింది వైసిపి నాయకులు అనుకుంటున్నారని కాబట్టి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు.

ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత అన్నారు.ఇటువంటి దాడులు విషయంలో పోలీసు వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ప్రజలు ఓపికగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: