మాజీ సీఎం,  మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య మృతి ప‌ట్ల ఎంపీ టీజీ వెంక‌టేష్ తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసారు. రోశయ్య అందరి వాడు అని, దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతల్లో రోశయ్య ఒకరు అని పేర్కొన్నారు. రోశయ్య మృతితో రాజకీయ ధృవతార రాలిపోయింది అని చెప్పారు. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని.. ఎంపీ టీజీ వెంక‌టేష్ సంతాపం తెలిపారు.

అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి కొనిజేటి రోశ‌య్య ప్ర‌గాఢ సంతాపాన్ని ప్ర‌క‌టించారు.  గుంటూరు జిల్లా వేమూరు లో పుట్టి  రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించార‌ని గుర్తుకు తెచ్చారు. చివరి వరకు తాను నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసిన వ్యక్తి కోణిజేటి రోశయ్య అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య మృతి పట్ల  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: