జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  ఓ మంచి పని చేశారు. పవన్ కళ్యాణ్  పుట్టిన రోజు సందర్భంగా "జల్సా" చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అలా చేయడం ద్వారా వచ్చిన డబ్బుని జన సైనికులు సాయి రాజేష్, ఎస్.కే.ఎన్. సతీష్ భొట్ట, ధర్మేంద్ర పార్టీ కోసం విరాళంగా అందజేశారు. నా సేన కోసం నా వంతు పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాను ప్రదర్శించగా కోటి రూపాయలు వచ్చాయట.


ఈ కోటి రూపాయల చెక్ ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గారు చేతుల పవన్ కళ్యాణ్ కు అందించారు. పార్టీ పట్ల అభిమానం కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా కోటి రూపాయలు విరాళం సేకరించే స్థాయికి ఎదిగిందని పవన్ కల్యాణ్, నాగబాబు వారిని అభినందించారు. పార్టీకోసం, సమాజ హితం కోసం పనిచేసిన జనసైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మిగత జన సైనికులకు, వీర మహిళలకు స్ఫూర్తిదాయకమని పవన్, నాగబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: