యూపీలోని మథుర పోలీసులు స్వయంగా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. అంతే కాదు.. ఈ వాదనతో నార్కోటిక్ డ్రగ్స్ కోర్టుకు యూపీ పోలీసులు ఓ నివేదిక సమర్పించారు. వేర్వేరు దాడుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 586 కేజీల గంజాయిని సరెండర్ చేయాలని కోర్టు వారిని ఆదేశించింది. దీంతో షేర్ ఘర్ , హైవే పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టిన గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్నసైజులో ఉండే ఎలుకలు పోలీసులకు భయపడడం లేదట. ఈ సమస్యను పరిష్కరించడానికి మేమేం నిపుణులం కాదని పోలీసులు వాదిస్తున్నారు. మరి ఎలుకలే తినేశాయా.. లేక ఖాకీలే పక్కదారి పట్టించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యూపీలోని మథుర పోలీసులు స్వయంగా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. అంతే కాదు.. ఈ వాదనతో నార్కోటిక్ డ్రగ్స్ కోర్టుకు యూపీ పోలీసులు ఓ నివేదిక సమర్పించారు. వేర్వేరు దాడుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 586 కేజీల గంజాయిని సరెండర్ చేయాలని కోర్టు వారిని ఆదేశించింది. దీంతో షేర్ ఘర్ , హైవే పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టిన గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్నసైజులో ఉండే ఎలుకలు పోలీసులకు భయపడడం లేదట. ఈ సమస్యను పరిష్కరించడానికి మేమేం నిపుణులం కాదని పోలీసులు వాదిస్తున్నారు. మరి ఎలుకలే తినేశాయా.. లేక ఖాకీలే పక్కదారి పట్టించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.