అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి ఫోటోలను ఇటీవల శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత దీనిపై స్పందించారు. 


ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామమందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను జత చేస్తూ.. అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అని ఆమె  పేర్కొన్నారు. రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్న కవిత..  రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారన్నారు. సాధారణంగా ఇలాంటి పోస్టులకు దూరంగా ఉండే కవిత.. అయోధ్యపై పోస్టు పెట్టడం మోదీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకే అనే విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: