తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్ధపల్లి జిల్లా మంథని 45.2, నల్గొండ జిల్లా నిడమనూరు 45.2, జగిత్యాల జిల్లా కల్వై 45.1, యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల 45.1, వరంగల్‌ జిల్లా ఊర్సు 45, వనపర్తి జిల్లా కన్నాయిపల్లి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.


తీవ్రమైన వడగాల్పులు కూడా పలుజిల్లాల్లో నమోదయ్యాయి. ఇవాళ, రేపు వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇవాళ మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పుల వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు  నాగర్ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


రేపు  ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కోంది. గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: