మీరు   మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయాలనీ అనుకుంటారా.. ఐతే ఈ శుభవార్త మీకోసం.. గతంలో లాగా  మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఇకపై వారం రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ఒకే సర్కిల్‌లో అయితే మూడు రోజుల్లోనే నెంబర్‌ పోర్టబిలిటీ అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. తాజా  నిబంధనలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) ప్రక్రియను చాల సులభంగా చేయడం జరిగింది. ఈనెల 16  నుంచి నూతన నిబంధనలు వర్తిస్తాయి అని టెలికాం  అధికారులు వెల్లడించడం జరిగింది.

 

ఒక వేళా సబ్‌స్క్రైబర్‌ తన మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి అర్హతలు ఉంటే టెలికాం రెగ్యులేటర్ ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ (యుపిసి)ని అందిచడం జరుగుతుంది. కస్టమర్‌కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అర్హత ఉందా లేదా అనేది ట్రాయ్‌ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒక వేళా మీరు  పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు ఐతే  తాము చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన తర్వాతే ఎంఎన్‌పీకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అని టెలికాం అధికారులు తెలిపారు. ఇక చట్టనిబంధనల ప్రకారం నిషేధానికి గురైన మొబైల్‌ నంబర్‌ను కూడా ఎంఎన్‌పీకి అనుమతిచడం జరగదు.

 

 ఒక వేళా మీ నెంబర్ న్యాయస్ధానాల పరిధిలో ఉన్న మొబైల్‌ నెంబర్‌కూ ఎంఎన్‌పీని  అనుమతిచడం జరగదు. ఆయా మొబైల్‌ ఆపరేటర్లతో ఎగ్జిట్‌ క్లాజ్‌లో కాంట్రాక్టులో పొందుపరిచిన అంశాలను పరిష్కరించకుండా ఉంటే ఎంఎన్‌పీ కూడా పరిగణంలోకి తీసుకోవడం జరగదు. ఇంకా  ప్రతి పోర్టింగ్‌ విజ్ఞప్తికి ట్రాయ్‌ రూ 6.46లను లావాదేవీ ఫీజుగా వసూలు చేయడం జరుగుతుంది. ఇక వ్యక్తిగత యూజర్ల మాత్రం పోర్టింగ్‌ వినతిని యూపీసీ వ్యాలిడిటీ ముగిసే వరకూ తిరస్కరించరాదని ట్రాయ్‌ స్పష్టంగా తెలియాచేయడం జరిగింది. 

 

ఇక కార్పొరేట్‌ సంస్థలు యూజర్ల కార్పొరేట్‌ మొబైల్‌ నంబర్ల పోర్టింగ్‌ కోసం అధికారికంగా లేఖను రాసి పంపవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటి అంటే...  అదే సర్కిల్‌లో నంబర్‌ పోర్టింగ్‌కు కోసం  మూడు రోజులు చాలు , అదే ఒకవేళ  వేరే సర్కిల్‌లో అయితే అయిదు పనిదినాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది అని ట్రాయ్‌  తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: