రాజధాని సరిహద్దు లో రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు విజ్ఞప్తి చేశారు. మరోవైపు చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ అంగీకరించబోమని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. చట్టాలను ఉపసంహరించే వరకు ఇంటికెళ్లేది లేదని తేల్చి చెబుతున్నాయి. మరి ఈ విషయం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి.. ఎవరు ఎవరిని బుజ్జగిస్తారో చూడాలి..
రాజధాని సరిహద్దు లో రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు విజ్ఞప్తి చేశారు. మరోవైపు చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ అంగీకరించబోమని రైతు సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. చట్టాలను ఉపసంహరించే వరకు ఇంటికెళ్లేది లేదని తేల్చి చెబుతున్నాయి. మరి ఈ విషయం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి.. ఎవరు ఎవరిని బుజ్జగిస్తారో చూడాలి..