ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ మేరకు ఏపిలో కొత్త కంపెనీలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా మరో కంపెనీ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్ తన సొంత జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరర్ అయిన అపాచీ ఇంటెలిజెంట్ సెజ్‌కు సీఎం జగన్ డిసెంబర్ 24న పులివెందులలో శంకుస్థాపన చేయనున్నారు. లెదర్ ఇండస్ట్రీలో అపాచీ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 2 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు...



ఇకపోతే ఈ నెల 25 న క్రిస్టమస్ పండుగను తన సొంత ఊరిలో చేసుకోనున్నారు. అందులో భాగంగా ఈ కంపెనీని స్థాపించనున్నట్లు తెలిపారు.పట్టణంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌‌మెంట్ పార్కులో.. జేఎన్టీయూ కాలేజీ వెనుక భాగంలో అపాచీ కోసం 27.94 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.. అయితే ఆ కంపెనీ కట్టించడానికి ప్రభుత్వం ఆ స్థలాన్ని పరిశీలించారు. ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి అపాచీ కంపెనీ అధికారులకు చూపించారు.



ఆంధ్ర ప్రదేశ్ లో మరో చోట ఈ కంపెనీని స్థాపించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికోసం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో అపాచీ కార్యకలాపాలు సాగిస్తోంది. కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సీఎం కట్టుబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ది చేసేందుకు జగన్ సర్కార్ కొత్త ఆలోచనలకు శ్రీకారం  చుట్టారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అంటూ వైకాపా నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల వేలాది మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరుతుందని అంటున్నారు. ప్రజలు కూడా జగన్ ఆలోచనని సమర్థిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: