రేషన్ కార్డులున్న వారికి కేంద్రం నుంచి శుభవార్త ?

దేశ వ్యాప్తంగా కూడా రేషన్‌ కార్డులు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం చక్కటి శుభవార్తని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అంత్యోదయ కార్డుదారులందరికీ కూడా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు గాను ఫ్రీగా చికిత్స అందించే విధంగా కొత్త పథకం ను తీసుకురాబోతున్నారు.ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఆయుష్మాన్ భారత్‌ లో భాగంగా ఈ పథకంను తీసుకువస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది.ఇప్పటికే అంత్యోదయ కార్డులు ఉన్నవారికి ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో.. సహకారంతోనే ఈ పథకం కొనసాగబోతున్నట్లుగా కూడా చర్చ అనేది జరుగుతోంది.ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులు అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుస్మాన్ కార్డులకు కూడా అర్హులు అంటూ ఇప్పటికే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు పేర్కొనడం జరిగింది.


ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్‌ కార్డు కోసం రేషన్‌ కార్డును పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్‌ లో చూపించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంత్యోదయ కార్డు ఉన్న వారందరూ కూడా ఆయుష్మాన్‌ కార్డును పొందవచ్చు అంటూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకా అంతే కాకుండా కొత్తగా కార్డులను తయారు చేయించేందుకు గాను ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఆయుష్మాన్ కార్డుదారులు ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సని చేయించుకోవచ్చు. ఉచితంగా అసలు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఆయుష్మాన్ కార్డుల ద్వారానే చికిత్స చేయించుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం వల్ల కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: