ఇటీవలి కాలంలో ప్రేమ అనే ముసుగులో ఎంతో మంది కామాంధులు దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. నిన్నే ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వే నా సర్వస్వం అంటూ మాయ మాటలు చెబుతున్నా ఎంతోమంది చివరికి శారీరక వాంఛలు తీర్చుకునీ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. పెళ్లి అనే పేరుతో హద్దులు దాటి చేస్తూ ఆడ పిల్లల జీవితాలతో ఆట ఆటలు ఆడుకుంటున్నారు అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 మాయ మాటలతో ఒక మైనర్ బాలికను లొంగదీసుకున్న యువకుడు చివరికి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు.  ఈ క్రమంలోనే పలుమార్లు అత్యాచారం చేయడంతో సదరు మైనర్ బాలిక గర్భం దాల్చింది. గర్భం పోవడానికి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వగా ఆ టాబ్లెట్ ఆ మైనర్ బాలిక ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  యువకుడి మాటలు నమ్మిన మైనర్ బాలిక చివరికి పెళ్లి  చేసుకుంటాడు అని నమ్మకం తో శారీరక సంబంధానికి  ఓకే చెప్పింది.


 నర్సాపూర్ మండలంలోని తండాకు చెందిన 21 సంవత్సరాల శత్రునాయక్  అదే  తండాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చివరికి మైనర్ బాలిక గర్భం దాల్చింది. మూడో కంటికి తెలియకుండా ఉండాలని శత్రు నాయక్ ఐదు నెలల గర్భవతి గా ఉన్న అమ్మాయికి టాబ్లెట్ ఇచ్చి అబార్షన్ చేయించాలని  ప్రయత్నించాడు.   అమ్మాయి వయసు 15సంవత్సరాలు కావడంతో టాబ్లెట్ వికటించి అధిక రక్తస్రావం అయింది.  పరిస్థితి సీరియస్ గా మారడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. హెల్త్ కండిషన్ పై ఇప్పుడే ఏమీ చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: