
అమృత్సర్ లోని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద చీపురుల సరుకును అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ సమయంలో హెరాయిన్ రికవరీ చేయబడిందట. దీని విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందట. పాకిస్తాన్ నుంచి ల్యాండ్ రూట్ ద్వారా భారత్లోకి హెరాయిన్ తీసుకువచ్చేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే చీపుర్ల లోడుతో వస్తున్న ట్రక్కును డిఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. అయితే పైనకు చూడ్డానికి చీపురులే కనిపించాయి. కానీ అనుమానంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
ఈ సరుకులో 40 బ్యాగుల్లో 4000 చీపుర్లు ఉన్నాయని.. అయితే ఈ చీపుర్లలో హెరాయిన్ ను దాచినట్లు పోలీసులు గుర్తించారు. మూడు బ్యాగుల్లోని వెదురు బొంగులో హెరాయిన్ నింపి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వెదురు బొంగులకు చీపురు కర్రలను జోడించి ఒక సీల్ కూడా వేశారు. పైనకు చీపురులా కనిపించినా లోపల మాత్రం కోట్ల రూపాయల విలువచేసే హెరాయిన్ ఉందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోని ఇలా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు అటు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.