పనస కాయ అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉండరు. పనస తొనలు తినడానికి భలే రుచి కరంగా ఉంటాయి. అలాగే పనస కాయతో బిర్యానీ, స్వీట్స్ ఇలా ఎన్నో రకాల వెరైటీస్ చేయవచ్చు. అలాగే పనసbకాయలో ఉండే తొనలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పనస తొనల తోటి ఎంతో కమ్మనైన రుచి కరమైన పాయసం చేయవచ్చు అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. ఈ పాయసం కూడా తినడానికి చాలా రుచి కరంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా పనస కాయ పాయసం ఎలా చేయాలో చూద్దామా.. !

 కావలసిన పదార్థాలు:

పనస  కాయ తొనలు: 1cup
బెల్లం తురుము: 1-2cups
చిక్కని పాలు -1 లీటర్
యాలకుల పొడి: 1tsp
బాదం: 8
జీడి పప్పు: 8
ఎండు ద్రాక్ష: 8
నెయ్యి: 2-3tsp

తయారు చేయు విధానము:

మొదటగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పాన్ అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పనస తొనలు తీసుకుని అందులోని గింజలను వేరు చేసి వాటిని ఒక మిక్సీ జార్ లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు పొయ్యి మీద  ఒక చిన్న గిన్నె పెట్టి అందులో పాలు పోసి బాగా మరగ నివ్వండి. తరువాత పాలలో బెల్లం తురుము వేసి తిప్పండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పనస తొనల మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి కలపండి.తర్వాత యాలుక్కాయల పొడి కూడా వేసి బాగా తిప్పండి. పాయసం లో తీపి చాలకపోతే ఇంకాస్త బెల్లం వేసుకోండి. ఇప్పుడు ముందుగా వేపుకున్న జీడి పప్పు, కిస్ మిస్, బాదం పప్పులు వేసి గార్నిష్ చేసుకోండి.అంతే ఎంతో రుచి కరమైన పనసకాయ పాయసం రెడీ అయినట్లే. ఒకసారి  మీరు కూడా ట్రై చేసి చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: