భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు ప్రేమ ఆప్యాయత లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక సారీ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత తుది శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి.  కష్టం వచ్చినా సుఖం వచ్చిన కట్టుకున్న వారి పక్కనే ఉండాలి అని  చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో దాంపత్య బంధాన్ని చూస్తుంటే మాత్రం ఇవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి అన్నది అర్ధమవుతుంది.  నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు. తరచూ మనస్పర్థల తో గొడవలు పడుతూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా కట్టుకున్న వారికి తోడు నీడగా ఉండాల్సిన వారే మూడుముళ్ల బంధం తెంచుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. దారుణంగా కట్టుకున్న వారిని చంపేసి ఉన్మాదులు గా మారిపోతున్నారు.  సాటి మనుషులు అయిన కాస్తయినా జాలి కూడా చూపించడం లేదు. నేటి రోజుల్లో ఇలా దాంపత్య బంధం ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నేటి రోజుల్లో. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  తాగుడుకు అలవాటు పడిన భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు.


 భర్త వేధింపులు భరించలేక భార్య అపర కాళిలా మారిపోయింది. దీంతో ఏకంగా భర్త మర్మాంగాన్ని కోసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మరిపెడ మండలం వాంకుతోడ్ తండాకు చెందిన బిచ్య అనే వ్యక్తి రోజూ తాగి వచ్చి వాడు. ఇక ఇటీవల కాలంలో ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిస గా మారిపోయాడు  భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. సూటిపోటి మాటలతో వేధించే వాడు. ఇక ఇటీవల భార్య భర్త తీరుతో విసుగు చెందింది. నిన్న రాత్రి కూడా భర్త తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ప్రమీల భర్త మర్మాంగాన్ని  కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: