సాఫీగా సాగిపోతున్న సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు తెచ్చిపెడుతున్నాయి. కట్టుకున్న బంధాన్ని కాదని పరాయి వ్యక్తుల ఆకర్షణలో పడుతున్న ఎంతోమంది ఏకంగా చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలా క్షణకాల సుఖం కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అక్రమ సంబంధాలు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది అక్రమ సంబంధాల నేపథ్యంలో ఏకంగా కట్టుకున్న వారి ప్రాణాలను దారుణంగా తీసేందుకు కూడా వెనకాడటం లేదు. ఇలా అక్రమ సంబంధాల నేపథ్యంలో నేటి రోజుల్లో జరుగుతున్న దారుణ హత్యలు ఎక్కువైపోతున్నాయి.



 అయితే ఎన్ని హత్యలు వెలుగు లోకి వచ్చినప్పటికీ ఎక్కడ జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డు లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇక అతను కర్నూలుకు చెందిన నాగ రాజు గా పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల నుంచి పట్టణంలో రోడ్లపక్కన కాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే నాగరాజు పట్టణంలో నివాసముంటున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడగా ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.


 అయితే సదరు మహిళ పటేల్ రోడ్డు లో భర్త తో కలిసి నివాసం ఉంటుందట. ఇటీవలే వీరిద్దరి మధ్య సాగుతున్న వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడం తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తీరు మార్చుకోవాలి అంటూ రెండు పలుమార్లు హెచ్చరించాడు.  భార్యకు ఎంత సూచించిన కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇక భార్య ప్రియుడిని హత్య మార్చాలి అని నిర్ణయించుకున్నాడు సదరు మహిళ భర్త. ఇందులో భాగంగానే నాగరాజును దారుణం గా కొట్టి చంపేసి నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: