ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వివాహేతర సంబంధాన్ని బయట పెట్టాడు అని కోపంతో ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు ని దారుణంగా హత్య చేశాడు ఇక్కడొక కసాయి తండ్రి.. చేతికొచ్చిన కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఈ ఘటన అనంతపురం జిల్లా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శక్తి నగర్ రెండో క్లాస్ లో మెహబూబ్ బాషా, శంషాద్ బేగం దంపతులు ఉంటున్నారు. వీరికి మహరాజ్ హుస్సేన్ అనే 21 ఏళ్ళ కొడుకు మరో కూతురు ఉన్నారు.
తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయాన్ని తన మామకు చెప్పి బయట పెట్టాడు కొడుకు మెహరాజ్ హుస్సేన్. దీంతో అన్వర్ బాషా మహబూబ్బాషా ను మందలించాడు.. అప్పటి నుంచి సొంత కొడుకు పైన కక్ష పెంచుకున్నాడు తండ్రి మెహబూబ్ భాష. ఈ క్రమంలోనే ఇటీవలే భార్య కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించాడు మహబూబ్ బాషా.. అల్లా నామస్మరణ లో ఉన్న మహరాజ్ హుస్సేన్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలోనే మంటలు ఎగసి పడటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మెహబూబ్ భాష . విషయం తెలుసుకున్న స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన మెహారాజ్ హుస్సేను స్వల్పంగా గాయపడిన తండ్రి మెహబూబ్ భాష ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.