ఈ లోకంలో మహిళగా పుట్టడమే పాపమా.. అవును ప్రతి మహిళకు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అక్కగా అమ్మగా ఎంతో కీలకమైన పాత్ర పోషించే మహిళ నేటి రోజుల్లో మాత్రం కామాంధుడి కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలను తీసుకు వచ్చారు. కానీ చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ నేరస్థులు మాత్రం ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతూనే ఉన్నారు. కామంతో కళ్లుమూసుకు పోతూ తాము ఒక సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషులం అన్న విషయాన్ని సైతం మరిచిపోయి దారుణంగా మానవ మృగాలుగా మారిపోతున్నారు.



 దీంతో ఆడపిల్లగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అడుగడుగున కామపు కోరలు పంజా విసరడానికి సిద్ధంగానే ఉంటున్నాయి. నెలల నిండని పసికందుల నుండి  పండు ముసలి వరకు కూడా ఎవరిని  వదలడం లేదు కామాంధులు. ఇటీవలి కాలంలో పిల్లలకు చదువు చెప్పి సరైన మార్గంలో నడిపి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు ఎంతో నీచంగా ప్రవర్తిస్తూ ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ఎంతో గౌరవమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఒక కీచక టీచర్ ఇలాంటిదే చేశాడు



 ఏకంగా పదవ తరగతి విద్యార్థిని పై కన్నేసిన టీచర్  గర్భవతిని చేశాడు. కేరళలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోచింగ్ క్లాసులకు కోసం పదవ తరగతి విద్యార్థిని టీచర్ ఇంటికి వెళుతూ ఉండేది. చదువులు చెప్పాల్సింది మాని ఆ యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు ఆ టీచర్. ఈ క్రమంలోనే పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక కొన్ని నెలలకు ఆ యువతి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి  విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: