అయితే ఇప్పటివరకు విశ్వాసానికి మారుపేరు కేవలం పెంపుడు కుక్కలు మాత్రమే అని అందరూ చెబుతుంటారు. కానీ పాడి పశువులు కూడా యజమానుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి అన్నది మాత్రం ఇక్కడ జరిగిన ఘటనతో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏకంగా ఒక గేదె యజమాని ప్రాణాలు కాపాడటానికి తన తనువు చాలించింది. కరెంట్ షాక్ తో యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే ఎంతో దూరం నుంచి ఇది గమనించిన గేదె ఇక అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. చివరికి కిందపడిపోయిన కరెంటు వైర్లు గేదె ను కూడా అంటుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని బాదోహి లో వెలుగులోకి వచ్చింది. బాబు సరాయ్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల పరాస్ పటేల్ అనే వ్యక్తి రాత్రి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా వర్షం మొదలైంది ఇంతలోనే పరాస్ పటేల్ మంచం తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడిపోయాడు. ఇక తీగలు అతని అంటుకోవడంతో పరాస్ పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. గమనించిన అతని కుమారుడు శివశంకర్ అక్కడికి చేరుకొని తండ్రిని రక్షించే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో అతను కూడా షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే పక్కనే పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న గేదె ఇది చూసి యజమాని కష్టాల్లో ఉండడాన్ని గమనించింది. దీంతో పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. చివరికి యజమాని ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా శివశంకర్ తీవ్ర గాయాలపాలైన చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.