ఇటీవలి కాలంలో సినిమాల ప్రభావం యువతపై  ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.   సినిమాలో చేసినట్లుగానే నిజజీవితంలో చేయాలని అనుకుంటున్నారు ఎంతోమంది.. దీంతో  ఎన్నో నేరాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక్కడ  ఏకంగా ఒక సినిమాను చూసి సీరియల్ కిల్లర్ గా మారిపోయాడు యువకుడు.  ఏకంగా ఫేమస్ అయ్యేందుకు ఐదుగురిని దారుణంగా హతమార్చాడు. యాక్షన్  సినిమా ప్రభావంతో ఇలా సీరియల్ కిల్లర్  గా మారి పోవడం సంచలనంగా  మారిపోయింది అని చెప్పాలి.


 సెక్యూరిటీ గార్డు లే లక్ష్యంగా చేసుకుని దారుణమైన హత్యలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ ఘటన కాస్త పోలీసులు సైతం అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక హత్య గురైన  ఓ వ్యక్తి వద్ద దొంగలించిన ఫోన్ ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే అతను చెప్పిన  విస్తుపోయే  నిజాలు విని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  సాగర్ కు చెందిన శివ ప్రసాద్ అనే 19 ఏళ్ల యువకుడు విపరీతంగా సినిమాలు చూస్తూ ఉండేవాడు.


 ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి శివప్రసాద్ ఎంతగానో ప్రభావితం అయ్యాడు.  సినిమాలో లాగానే నేరాలు చేస్తూ ఫేమస్ అవ్వాలని భావించాడు.  ఈ క్రమంలోనే సాగర్ నగరంలో మూడు రాత్రుల్లో వరుసగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులను దారుణంగా హతమార్చాడు.  ఇక మే నెలలో కూడా ఒక వ్యక్తిని చంపాడు.   నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులపై  యువకుడు దాడులకు పాల్పడుతూ ఉండేవాడు. అయితే గత రాత్రి భోపాల్లో ఓ మార్బుల్ దుకాణం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు  సోను  వర్మపై మార్బుల్ రాయితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. మృతుడి  సెల్ఫోన్ కనిపించకపోవడంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించగా అతను చేసిన హత్యలకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: