ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషుల లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనిషికి సహాయం చేసేందుకు ఎప్పుడు ముందుండేవాడు మనిషి. కానీ ఇప్పుడు సహాయం చేయడం గురించి దేవుడెరుగు ఏకంగా సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ లేకుండా ప్రవర్తిస్తున్నాడు మనిషి.



 ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఏ క్షణంలో ఎవరు ఎక్కడి నుంచి ప్రాణాలు తీస్తారో అని అందరూ భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏకంగా ప్రేమ కోసం ఎంతోమంది హత్యలు చేసేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ అనే మాయలో నిండా మునిగిపోయిన ఒక 15 ఏళ్ల బాలిక కనిపెంచిన తండ్రిని తోడబుట్టిన తమ్ముడిని చంపేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఏకంగా దారుణంగా ప్రాణాలు తీయడం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.


 15 ఏళ్ల బాలిక 52 ఏళ్ల తండ్రిని ఎనిమిదేళ్ల సోదరుడిని చంపేసింది. అయితే మొదట బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఇంట్లో సోదా చేయగా ఏకంగా ఫ్రిడ్జ్ లో మృతదేహాలు లభించాయి. అయితే ఆమె 19 ఏళ్ల యువకుడితో పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమతిస్తున్నారు. కాగా అతను గతంలో ఫోక్సో చట్టం కింద శిక్ష అనుభవించి విడుదలైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రియుడుతో కలిసి కూతురే అటు తండ్రి తమ్ముడిని హత్య చేసినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: