నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే.. చిన్న చిన్న కారణాలకే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలను తీసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు మనిషి. అత్యంత దారుణంగా హత్యలు చేస్తూ ఇక సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నారు. అయితే సొంత వారి విషయంలో కూడా ఇలా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న మనుషులను చూసి సాటి మనుషులే భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని అందరూ భయపడిపోతున్నారు.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో స్నేహబంధం అనేది ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తోబుట్టువులకు చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులకు చెప్పుకుంటారని ఇక కష్టసుఖాల్లో స్నేహితులు ఎప్పుడూ తోడునీడగా ఉంటారని అందుకే స్నేహబంధాన్ని మించింది మరొకటి లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన స్నేహితులే.. చివరికి అతన్ని కడ తేర్చారు. చిన్న కారణానికి దారుణంగా హత్య చేశారు.


 అన్నం వండలేదు అనే కారణంతో ఒక వ్యక్తిని అతని స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన వినయ్ సింగ్, సోను తివారి, సందీప్, హన్స్ రామ్ కుత్బుల్లాపూర్ లోని ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు. గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్, సోను ఇటీవలే మద్యం తాగి గదికి వచ్చారు. అయితే అన్నం ఎందుకు వండలేదు అని ఇద్దరు కలిసి హన్స్ రామ్ ను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో దెబ్బలు తల లేకపోయినా సదరు యువకుడు చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: